లారీ బోల్తా... ఇరువురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-04-20T05:24:13+05:30 IST

సెయింట్‌ క్లారెట్‌ పాఠశాల సమీపంలో జాతీయ రహదారి పై సోమ వారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తాపడింది.

లారీ బోల్తా... ఇరువురికి తీవ్రగాయాలు
బోల్తా పడిన లారీ

నరసన్నపేట : సెయింట్‌ క్లారెట్‌ పాఠశాల సమీపంలో జాతీయ రహదారి పై సోమ వారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బిహార్‌ నుంచి బియ్యం లోడ్‌తో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడ్డింది. ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్‌ చంటి, కృష్ణ గాయపడ్డారు. వీరిని 108లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ కాంతారావు చెప్పారు. 



Updated Date - 2021-04-20T05:24:13+05:30 IST