తేజేష్కు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2021-10-17T06:40:07+05:30 IST
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకుగురైన తేజే్షరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం బంధువులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల నడుమ ముగిశాయి.
కేవీపల్లె, అక్టోబరు 16: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకుగురైన తేజే్షరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం బంధువులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల నడుమ ముగిశాయి. కుమారుడి కడసారి చూపుకోసం తల్లి జ్యోతి గురువారం కువైట్ నుండి వచ్చిన విషయం తెలిసిందే. తండ్రి నాగిరెడ్డి శుక్రవారం ఉదయం కువైట్ నుండి వచ్చి కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించాడు. అభం శుభం తెలియని చిన్నారిని చంపేందుకు వారిని చేతులెలా వచ్చాయంటూ కన్నీటిపర్యంత మయ్యాడు. గ్యారంపల్లె పంచాయతీ సంకేనిగుట్టపల్లిలో జరిగిన అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుండి జనం అధికంగా తరలివచ్చారు.