గత సంవత్సరం జీడీపీని లాక్డౌన్, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయి... అంతర్జాతీయ ద్రవ్యనిధి
ABN , First Publish Date - 2021-01-27T21:41:38+05:30 IST
గత సంవత్సరం జీడీపీని లాక్డౌన్, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయి... అంతర్జాతీయ ద్రవ్యనిధి
వాషింగ్టన్ డీసీ : ఈ(2021-22) ఆర్ధిక సంవత్సరంలో... భారత్ వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉంటుందని, 11.5 %గా నమోదయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కరోనా వైరస్ ఇబ్బందుల్లోనూ రెండంకెల జీడీపీని నమోదు చేయగల ఒకేఒక్క దేశం భారత్ అని తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అప్డేట్లో ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. కాగా... చైనా 8.1 % జీడీపీని సాధించవచ్చన్న ఆమె... ప్రపంచ వృద్ధిరేటు ఈసారి 5.5% గా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇక ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి... అవకాశాలు 2021’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ కూడా ఓ నివేదికను విడుదల చేసింది. కిందటి సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ మైనస్ 9.6 శాతంగా నమోదు కావచ్చని ఐరాస అంచనా వేసింది. ఈ ఏడాది మాత్రం 7.3 శాతం వృద్ధి కనిపిస్తుంచే అవకాశాలున్నాయని పేర్కొంది. గత సంవత్సరం(2020) జీడీపీని లాక్డౌన్, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయని పేర్కొంది.