ప్రారంభమైన సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్

ABN , First Publish Date - 2021-08-28T01:00:18+05:30 IST

గుడివాడలోని తొమ్మిదో వార్డులో సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి

ప్రారంభమైన సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్

గుడివాడ: గుడివాడలోని తొమ్మిదో వార్డులో సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. తొమ్మిదో వార్డు పరిధిలో ఇంటింటికి వెళుతూ, ప్రజల సమస్యలను మంత్రి నాని, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  శుక్రవారం నుంచి సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వాళ్ల అవసరాలను తెలుసుకోవాలని సచివాలయ కార్యదర్శులకు కలెక్టర్ నివాస్ సూచించారు. సచివాలయాలతో ప్రజలకు మరింత బంధాన్ని పెంచేందుకే ప్రభుత్వం సిటిజన్ అవుట్రిచ్ క్యాంపెయిన్ ప్రారంభించిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. 

Updated Date - 2021-08-28T01:00:18+05:30 IST