‘వైసీపీ ప్రభుత్వంలో 70 ఏళ్లకు సరిపడా దాడులు జరిగాయి’

ABN , First Publish Date - 2020-09-29T20:43:12+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో దళితులపై దాడులు 70 ఏళ్లకు సరిపడా జరిగాయని..

‘వైసీపీ ప్రభుత్వంలో 70 ఏళ్లకు సరిపడా దాడులు జరిగాయి’

విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో దళితులపై దాడులు 70 ఏళ్లకు సరిపడా జరిగాయని లాయర్ శ్రావణ్ విమర్శించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రొద్భలంతోనే జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి చేశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


దళితులపై దాడులకు నిరసనగా అక్టోబర్ 2న ఛలో మదనపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చామని న్యాయవాది శ్రావణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దళితులు, ప్రజాస్వామ్యవాదులంతా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. జడ్జి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు స్క్రిప్టును చదవాల్సిన అవసరం తమకు లేదని శ్రావణ్‌ అన్నారు.

Updated Date - 2020-09-29T20:43:12+05:30 IST