న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-19T14:19:30+05:30 IST

దేశ వ్యప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద

న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో వ్యక్తి అరెస్ట్

 పెద్దపల్లి: దేశ వ్యప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో మరొకరిని రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో ఆరో నిందితుడిగా ఉన్న వెల్ది వసంతరావు(62)ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వసంతరావు గతంలో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేశారు. గ్రామంలో కడుతున్న పెద్దమ్మ గుడిని అడ్డుకునేందుకు న్యాయవాద దంపతులు ప్రయత్నం చేస్తున్నారనే కారణంతో నిందితులకు వసంతరావు సహాయం చేసిట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయవాద దంపతులను హత్య చేయడానికి ఏ1 కుంట శ్రీనును వసంతరావు ప్రోత్సహించాడు. గుంజపడుగు గ్రామ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా వసంతరావు ఉన్నారు.  


జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, శివనందుల చిరంజీవి,  అక్కపాక కుమార్,  ఊదరి లచ్చయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-03-19T14:19:30+05:30 IST