న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2022-02-18T05:29:08+05:30 IST

రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లే కుండా పోయిందని, దీని కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బల్మూ రి అమరేందర్‌రావు, జవ్వాజి శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
‘ఖని’లో ధర్నా చేస్తున్న న్యాయవాదులు

- విధులు బహిష్కరించి ధర్నా, నిరసనలు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లే కుండా పోయిందని, దీని కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల ని గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బల్మూ రి అమరేందర్‌రావు, జవ్వాజి శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు. గురువా రం గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా 6వ అదనపు న్యాయస్థానం ఎదుట మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెలుకల పద్మజ, ముచ్చకుర్తి కుమార్‌, వేల్పుల మురళీధర్‌యాదవ్‌, శైలజ, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, పంగ శంకర్‌, ఏలేశ్వరం చంద్రమౌళి, పెద్దెల్లి ప్రకాష్‌, గజెల్లి వెంకటేశ్వర్లు, పులిపాక రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, రేష్మ, ప్రసన్న, సుజాత, జ్యోతి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-18T05:29:08+05:30 IST