బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తే జరిమానా

ABN , First Publish Date - 2021-12-02T05:13:15+05:30 IST

బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తే జరిమానా

బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తే జరిమానా
స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న చైర్‌పర్సన్‌, కమిషనర్‌

కొత్తూర్‌: పట్టణంలోని బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, కమిషనర్‌ వీరేందర్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం స్థానికులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. చైర్‌పర్సన్‌, కమిషనర్‌ మాట్లాడుతూ చౌరస్తా నుంచి ప్రధాన రోడ్లను చెత్త రహిత మార్గాలుగా గుర్తించామని, దుకాణదారులు, ఇళ్ల యాజమానులు చెత్తను చెత్త బుట్టల్లో వేసి మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. బహిరంగంగా చెత్తవేసే వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. 75మైక్రాన్లకు మించి ఉన్న ప్లాస్టిక్‌ కవర్లనే ఉపయోగించాలన్నారు. కౌన్సిలర్లు మాదారం నర్సింహాగౌడ్‌, కోస్గి శ్రీనివాస్‌, సో మ్లనాయక్‌, హేమదేవేందర్‌, మున్సిపల్‌ మేనేజర్‌ మ ంజులత, గోపాల్‌గౌడ్‌, యాదయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T05:13:15+05:30 IST