వైసీపీ పాలనకు చరమగీతం
ABN , First Publish Date - 2020-08-04T11:16:00+05:30 IST
వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని రైల్వేకోడూరు జనసేన నేత, ప్రముఖ ఆడిటర్ గంధంశెట్టి దినకర్బాబు
జనసేన సమావేశంలో నేతలు
రైల్వేకోడూరు, ఆగస్టు, 3: వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని రైల్వేకోడూరు జనసేన నేత, ప్రముఖ ఆడిటర్ గంధంశెట్టి దినకర్బాబు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ రూ.2500 పెంచడం మరిచిపోయిందన్నారు. ప్రభుత్వం దొంగ సారాను అరికట్టడంలో విఫలం అవుతోందన్నారు. ఇళ్ల పట్టాల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జోగినేని మణి, ఎద్దల అనంతరాయులు, ముద్దపోలు సభాపతి, అంకిపల్లె అఖిల్కళ్యాణ్, ప్రకాష్, మర్రిరెడ్డి హేమంత్, మహిళా నాయకురాలు హలీమాబీ తదితరులు పాల్గొన్నారు.