క్రికెట్‌కు ఓఝా గుడ్‌బై

ABN , First Publish Date - 2020-02-22T10:31:14+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విటర్‌ ద్వారా...

క్రికెట్‌కు ఓఝా గుడ్‌బై

ముంబై: హైదరాబాద్‌కు చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విటర్‌ ద్వారా శుక్రవారం వెల్లడించాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓఝా..2013లో ముంబైలో చివరి టెస్ట్‌ ఆడాడు. సచిన్‌ ఆఖరి టెస్ట్‌ కూడా అదే కావడం గమనార్హం. అయితే దేశవాళీల్లో మాత్రం గతేడాది వరకు కొనసాగాడు. 16 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో మొత్తం 24 టెస్ట్‌లు ఆడిన 33 ఏళ్ల ప్రజ్ఞాన్‌ 113 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 21, ఆరు టీ20ల్లో 10 వికెట్లు సాధించాడు. రంజీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ‘జీవితంలో తదుపరి దశకు వేళైంది. నాకు మద్దతుగా నిలిచి, ప్రేమాభిమానులు పంచిన అందరికీ కృతజ్ఞతలు’ అని ఓఝా ట్వీట్‌ చేశాడు. ప్రజ్ఞాన్‌ను టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభినందిస్తూ ‘ముంబై ఇండియన్స్‌, భారత జట్టు సహచరుడిగా నీతో ఎన్నో మధురానుభూతులు పంచుకున్నా. మన స్నేహం క్రికెట్‌ మైదానానికి మించినది’ అని ట్వీట్‌ చేశాడు. 


Updated Date - 2020-02-22T10:31:14+05:30 IST