విశాఖలో వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ఎ

విశాఖలో వామపక్షాల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

విశాఖ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్‌ను తరలించాలని పౌరసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పౌర సంఘాల నేతలకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు చేయకూడదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో 14 మంది చనిపోయినా... కంపెనీ ప్రతినిధులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదంటూ పౌరసంఘాల నేతలు నిలదీశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ఏదైతే చెప్పిందో వాటిని ప్రజలకు వివరిస్తున్నామని పౌర సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST