గౌరారం సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు

ABN , First Publish Date - 2020-04-05T09:46:10+05:30 IST

స్థానికంగా నివాసం ఉండని బొంరాస్‌పేట్‌ మండలం, గౌరారంగ్రామ సర్పంచ్‌పై చట్టపరమైన

గౌరారం సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పౌసుమి బసు


వికారాబాద్‌, (ఆంధ్రజ్యోతి): స్థానికంగా నివాసం ఉండని బొంరాస్‌పేట్‌ మండలం, గౌరారంగ్రామ సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పౌసుమి బసు స్పష్టం చేశారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో ఆమె పలువురి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు ఆమె స్పందించి తగు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఈ సమయంలో గౌరారం సర్పంచ్‌ హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గ్రామానికి చెందిన ఒకరు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.


దీంతో ఆ సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. రేషన్‌ బియ్యం పంపిణీ, కొత్త రేషన్‌ కార్డుల జారీ, పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు ఆమె స్పందించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ మాట్లాడుతూ, కరోనా, రేషన్‌ బియ్యం తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 599 2644కు కాల్‌ చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, కంట్రోల్‌రూం ఇన్‌చార్జి కోటాజీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T09:46:10+05:30 IST