నిమ్మకు కరోనా కాటు..!

ABN , First Publish Date - 2020-04-05T10:06:45+05:30 IST

కరోనాతో నిమ్మ సాగు చేసే కౌలు రై తులు కుదేలయ్యారు. నిమ్మకాయలు కోసే కూలీలు రాక, రవాణా సౌకర్యం లేక నిమ్మ చెట్ల పైనే కోతకు వచ్చిన కాయలు ఎండిపోయి, రాలిపోతు న్నాయి.

నిమ్మకు కరోనా కాటు..!

కాయలు కోసేందుకు కూలీలు రాక..

రవాణా సౌకర్యం లేక.. ఎండి రాలిపోతున్న వైనం

ఆందోళనలో కౌలు రైతులు


లింగసముద్రం, ఏప్రిల్‌ 4 : కరోనాతో నిమ్మ సాగు చేసే కౌలు రై తులు కుదేలయ్యారు. నిమ్మకాయలు కోసే కూలీలు రాక, రవాణా సౌకర్యం లేక నిమ్మ చెట్ల పైనే కోతకు వచ్చిన కాయలు ఎండిపోయి, రాలిపోతు న్నాయి.  దీంతో  లక్షలు కౌలు చె ల్లించి పండించినా ప్రయోజనం లేద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. వడ్డీలకు తెచ్చిన పెట్టుబ డులు ఎలా వస్తోయోనని వారు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.  లింగసముద్రం గ్రామానికి చెందిన పలు వురు రైతులు వాకమళ్లవారిపాలెం, వలేటివారిపాలెం, బం గా రక్కపాలెం, నెల్లూరు జిల్లాలోని కొండాపురం, కలిగిరి మండ లాల్లోని మా మిడివారిపాలెం, కృష్ణారెడ్డిపాలెంలో నిమ్మతోటలు కౌలు కు తీసుకొన్నారు.


ఒక్కో ఎకరాకు సుమారు రూ.లక్ష పైగా చెల్లిం చా రు. వీరు గత ఏడాది  అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు కౌలుకు తీసుకున్నారు. ఇప్ప టికే నిమ్మ  కాయలు ఒక కోత కో యాల్సి ఉంది. వీరు కోసిన కాయలను టా టాఏస్‌ వాహనాల్లో లింగస ముద్రం తీసుకొని వచ్చి హైదరా బాద్‌కు వెళ్లే బస్సుల్లో ఎగుమతి చే స్తారు. కరో నాతో రవాణా సౌకర్యం లేదు. మ రోపక్క కాయలు కోసేందుకు సైతం కూలీలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో చెట్లపైనే కాయకలు ఎండి రాలిపో తున్నాయని రైతులు కన్నీరు మున్నీ రవుతున్నారు. 

Updated Date - 2020-04-05T10:06:45+05:30 IST