గుట్టపై చిరుతకూనల అరుపులు

ABN , First Publish Date - 2022-05-08T06:47:13+05:30 IST

మండలంలోని మోకన్‌పల్లిగుట్టపై శనివారం చిరుతపిల్లల అరుపులు విని తునికాకు సేకరణకు వెళ్లిన పరుగులు పెట్టారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు తల్లిచిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మహంతం గ్రామానికి చెందిన మెట్టు సాగర్‌ తన భార్య లక్ష్మితో బంధువులైన సుజాత, గంగామణిలతో కలిసి ఉదయం మోకన్‌పల్లి గుట్టపైకి తునికాకు సేకరణకు వెళ్లారు.

గుట్టపై చిరుతకూనల అరుపులు
చిరుతపిల్లలున్నాయని భావిస్తున్న మోకన్‌పల్లి గుట్ట ఇదే..

భయంతో తునికాకు సేకరణకు వెళ్లిన మహిళల

పరుగు

తల్లిచిరుతను పట్టుకోవాలంటూ 

మహంతం వాసుల విజ్ఞప్తి

నవీపేట, మే 7: మండలంలోని మోకన్‌పల్లిగుట్టపై శనివారం చిరుతపిల్లల అరుపులు విని తునికాకు సేకరణకు వెళ్లిన పరుగులు పెట్టారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు తల్లిచిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మహంతం గ్రామానికి చెందిన మెట్టు సాగర్‌ తన భార్య లక్ష్మితో బంధువులైన సుజాత, గంగామణిలతో కలిసి ఉదయం మోకన్‌పల్లి గుట్టపైకి తునికాకు సేకరణకు వెళ్లారు. తునికాకు కోస్తుండగా పొదల్లో నుంచి రెండు చిరుత పిల్లల అరుపులు వినిపించాయి. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇంటికి చేరుకున్న వారు విషయాన్ని గ్రామ పెద్దలకు తెలిపారు. కాగా గత నెల 12న మోకన్‌పల్లి పంచాయితీ పరిధిలోని రెడ్డిఫారం ఇటుక బట్టీలో తల్లి చిరుతతో పాటు పిల్లచిరుత సంచరించినట్లు అటవీ శాఖ అధికారుర ధు వీకరించారు. బోను ఏర్పాటు చేసినా అది చిక్కలేదు. గుట్టపై చిరుతతో పాటు పిల్లచిరుతలు తప్పక ఉంటాయని, ఇప్పటికైనా వాటిని బంధించాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కూలీపై ఎలుగుబంట్ల దాడి

డిచ్‌పల్లి: మండలంలోని మాక్లూర్‌ తండా అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్లిన వ్యవసాయ కూలీ ధర్మపై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి శనివారం దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యా డు. స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకునే ధర్మ, ఉదయం వేళ స్థానిక అడవుల్లో కి తునికాకు సేకరణకు వెళ్లాడు. ఒక్కసారి గా ఎలుగుబంట్లు దాడి చేశాయి. దీంతో ధర్మ అరుపులు, కేకలు విని తండావాసులు ఆయనను ఆటోలో చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. ధర్మ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేర కు సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. 

Read more