వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2020-03-29T18:06:05+05:30 IST

కుల్కచర్ల మండలంలో చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం

వికారాబాద్ జిల్లా: కుల్కచర్ల మండలంలో చిరుత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పొలాల వద్ద కట్టివేసిన లేగదూడలపై దాడి చేసి చంపుతోంది. తాజాగా మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాన్ సింగ్ నాయక్ అనే రైతు లేగదూడపై చిరుత దాడి చేసింది. ఇలా కుల్కచర్ల మండలంలోని ఏదో ఓ గ్రామ శివారుల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దీంతో స్థానిక రైతులు, ఊళ్ళోని జనాలు పొలాలకు వెళ్ళేందుకు భయపడుతున్నారు. ఎలాగైనా చిరుతను బంధించి తమ ప్రాణాలు, మూగ జీవుల ప్రాణాలు కాపాడలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-29T18:06:05+05:30 IST