నన్నే మాస్కు వేసుకోమంటారా?
ABN , First Publish Date - 2020-05-27T09:55:12+05:30 IST
‘మాస్కు వేసుకోమని నాకే చెబుతారా’ అంటూ..
పోలీసులతో లేపాక్షి తహసీల్దార్ వాగ్వాదం
పెనుకొండ టౌన్(అనంతపురం): ‘మాస్కు వేసుకోమని నాకే చెబుతారా’ అంటూ ఓ తహసీల్దార్ మంగళవారం పెనుకొండలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లేపాక్షి తహసీల్దార్ బలరాం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. తిరిగి లేపాక్షి వెళ్తుండగా దర్గా సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు తహసీల్దార్ వాహనాన్ని ఆపారు. మాస్కు వేసుకోవాలని ఎస్ఐ హారుణ్బాషా సూచించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తహసీల్దార్ వాహనం దిగి ‘నేను మండల మెజిస్ర్టేట్ను, నాకే మాస్కు వేసుకోవాలని సూచిస్తావా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సందర్భంలో పోలీసులు, తహసీల్దార్ మధ్య తీవ్ర వాగ్వాదం సాగింది. తహసీల్దార్, ఆయన వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. అక్కడ తనదే తప్పని తహసీల్దార్ పోలీసులకు చెప్పటంతో వివాదం సద్దుమనిగింది.