లేపాక్షి ఆలయం శిల్పకళ అపురూపం
ABN , First Publish Date - 2022-07-04T09:40:01+05:30 IST
లేపాక్షి ఆలయం శిల్పకళ అపురూపం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న
శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించిన న్యాయమూర్తి
లేపాక్షి/కదిరి, జూలై 3: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని దుర్గావీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పకళతో నిండి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాలో పర్యటించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. దుర్గావీరభద్రస్వాములకు పూజలు నిర్వహించారు. ఏకశిలా నంది విగ్రహాన్ని సందర్శించారు. ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. అనంతరం కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు.