గురుకులాల విద్యార్థులకు టీవీలో పాఠాలు
ABN , First Publish Date - 2020-07-05T08:01:12+05:30 IST
సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం జూలై 6 నుంచి దూరదర్శన్ యాదగిరి చానల్లో పాఠాలను ప్రసారం
సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం జూలై 6 నుంచి దూరదర్శన్ యాదగిరి చానల్లో పాఠాలను ప్రసారం చేయనున్నట్లు తెలంగాణ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎ్స.ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 6 నుంచి-18 వరకు డిగ్రీ విద్యార్థులకు , జూలైౖ 21 నుంచి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు, ఆగస్టు 3 నుంచి 11 వరకు పాఠశాల విద్యార్థులకు రోజూ మధ్యాహ్నం 1-30 నుంచి 2 గంటల వరకు పాఠాలు బోధిస్తారన్నారు.