ఐక్యతగా ఉందాం.. హక్కులను సాధిద్దాం

ABN , First Publish Date - 2022-01-24T05:03:12+05:30 IST

మాదిగ ఉద్యోగులంతా ఐక్యతగా ఉంటూ హక్కుల కోసం పోరాడి సాదిద్ధామని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిచ్చికె బాబు పేర్కొన్నా రు.

ఐక్యతగా ఉందాం.. హక్కులను సాధిద్దాం
సత్కారం పొందిన సభ్యులతో ఎమ్మార్పీయస్‌ నాయకులు

మైదుకూరు, జనవరి 23 : మాదిగ ఉద్యోగులంతా ఐక్యతగా ఉంటూ హక్కుల కోసం పోరాడి సాదిద్ధామని మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిచ్చికె బాబు  పేర్కొన్నా రు. ఆదివారం పట్టణంలోని జోస్‌పపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగల ఉద్యోగుల కమిటీ ఏర్పాటు నుంచి సమస్యలపై పలు మార్లు పోరాడి సాధించామని, ఐక్యతతోనే సాధించవచ్చని పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆదేశాలతో భవిష్యత్‌ కార్యాచరణ మేరకు అందరం నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పిచ్చికె బాబు, రవీంద్రబాబు, చాట్ల జయరాజు, ఓబులేసులను స్థానిక ఎమ్మార్పీయస్‌ నాయకులు కైపు భాస్కర్‌, జయచంద్ర, సంజీవ్‌లు ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2022-01-24T05:03:12+05:30 IST