2024లో టీడీపీని అధికారంలోకి తీసుకువద్దాం

ABN , First Publish Date - 2021-10-17T06:13:29+05:30 IST

2024 ఎన్నికల్లో టీడీపీ అధికారం లోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే కష్టపడి పని చేద్దామని పార్టీ మండల అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజు, జడ్పీటీసీ మాజీ సభ్యు డు కువైట్‌ శంకర్‌ పిలుపు నిచ్చారు.

2024లో టీడీపీని అధికారంలోకి తీసుకువద్దాం
పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌ను సన్మానిస్తున్న టీడీపీ నాయకులు

సన్మాన సభలో నేతల పిలుపు


ములకలచెరువు, అక్టోబర్‌ 16: 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారం లోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే కష్టపడి పని చేద్దామని పార్టీ మండల అధ్యక్షుడు గుత్తికొండ త్యాగరాజు,  జడ్పీటీసీ మాజీ సభ్యు డు కువైట్‌ శంకర్‌ పిలుపు నిచ్చారు. రాజంపేట టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపికైన సోంపల్లె మాజీ సర్పంచ్‌ యర్రగుడి సురేష్‌ను శనివారం ములకలచెరువులో ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... నాయకులు, కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేస్తే రాబోయే ఎన్ని కల్లో టీడీపీ అధికారంలో రావడం ఖాయ మన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనా లన్నారు. సురేష్‌ మాట్లాడుతూ... తనపై నమ్మ కంతో పార్టీ పదవి ఇచ్చిన నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తాన్నారు. అనంతరం నాయకులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఎంపీటీసీ ఎన్నికల సయమంలో అభ్యర్థులు చేసిన డిపాజిట్‌ను ఇంత వరకు ఇవ్వలేదని ఈవోఆర్డీ అబ్దుల్‌షుకూర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని మండలాల్లో డిపాజిట్‌ తిరిగి ఇచ్చారన్నారు. గ్రామకమిటీ అధ్యక్షులు శ్రీని వాసులు, రెడ్డెప్ప, వెంటకస్వామి, భాస్కర్‌రెడ్డి, నాయకులు పాలరాము, రామాంజులు, చెన్నకిష్టా, వెంటకసిద్ధయ్య, నాగమల్లప్ప, సుధాకర్‌నాయుడు, సుబ్బినాయుడు, శ్రీనివాసులు, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:13:29+05:30 IST