కార్యకర్తలకు అండగా ఉంటాం : గుండుమల
ABN , First Publish Date - 2021-07-29T06:27:38+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు.
మడకశిరరూరల్, జూలై 28: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. బుధవారం మండలంలోని సి.కొడిగేపల్లి గ్రామంలో గ్రామ దేవత కొల్లాపురమ్మ మరియు మారెమ్మజాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ సీనియర్ నాయకులు నరసింహమూర్తిఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట నాయకులు మల్లేగౌడ్, జయరామరెడ్డి, శివారెడ్డి, సి.ఆర్.వెంకటరెడ్డిలు ఉన్నారు.