దళిత వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేద్దాం
ABN , First Publish Date - 2021-06-11T09:25:22+05:30 IST
‘‘అసత్యపు మాటలు, అసాధ్యపు వాగ్దానాలు చేసి దళితుల ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను, దమనకాండను మౌనంగా భరించాలా? అదేమని ప్రశ్నిస్తున్న
సంఘాలు, నేతలకు వర్ల బహిరంగ లేఖ
విజయవాడ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ‘‘అసత్యపు మాటలు, అసాధ్యపు వాగ్దానాలు చేసి దళితుల ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను, దమనకాండను మౌనంగా భరించాలా? అదేమని ప్రశ్నిస్తున్న దళిత నాయకులను విమర్శించడం ఎంతవరకు సబబో ఆలోచించండి. దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. ఆమేరకు ఆయన గురువారం దళిత నాయకులకు బహిరంగ లేఖ రాశారు. విజ్ఞులైన దళిత నాయకులందరూ ఈ ప్రభుత్వ వ్యవహారశైలిని, దళిత వ్యతిరేక విధానాలను గమనించాలని కోరారు. దళితులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న వైనాన్ని వ్యతిరేకిస్తూ, దళితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు నష్టం చేసే విధంగా తీసుకున్న అనేక నిర్ణయాలను, దళితులపై జరిగిన దాడుల వివరాలను వర్ల రామయ్య తన బహిరంగ లేఖలో వివరించారు.