దాడులను చూస్తూ ఊరుకోం: నాగార్జున

ABN , First Publish Date - 2021-10-21T04:49:28+05:30 IST

తమ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టంచేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ చీపురుపల్లిలో తలపెట్టిన బంద్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతున్న ఆయనను పోలీసులు తన నివాసం వద్దనే అడ్డుకున్నారు.

దాడులను చూస్తూ ఊరుకోం: నాగార్జున
చీపురుపల్లిలో నాగార్జునను ఎత్తుకెళ్తున్న పోలీసులు

చీపురుపల్లి, అక్టోబరు 20: తమ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టంచేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ చీపురుపల్లిలో తలపెట్టిన బంద్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతున్న ఆయనను  పోలీసులు తన నివాసం  వద్దనే అడ్డుకున్నారు. కాసేపటి తరువాత నాగార్జున వెనుకవైపు ఉన్న గోడ దూకి బంద్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అడ్డుకొని... తిరిగి తన నివాసంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులకు పాల్పడడం హేయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, పైల బలరాం, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-21T04:49:28+05:30 IST