టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
ABN , First Publish Date - 2022-04-19T05:44:26+05:30 IST
తెలుగుదేశం పార్టీని గడపగడపకు తీసుకెళ్లి పూర్వ వైభవం తీసుకొస్తామని టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తుంగ మోపతయ్య అన్నారు.
చారకొండ, ఏప్రిల్ 18: తెలుగుదేశం పార్టీని గడపగడపకు తీసుకెళ్లి పూర్వ వైభవం తీసుకొస్తామని టీడీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తుంగ మోపతయ్య అన్నారు. ఈ నెల 20న టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా మండలంలోని సిర్సన గండ్ల ఆలయంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి పేర్లపై అర్చన చేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీకి పూర్వభైభవం తీసుకొచ్చే క్రమంలో ఈనెల 22 నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో పట్టణాలు, గ్రామాలు, తండాలు, చెంచుపెంటలలో విస్తృతంగా పర్యటించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చం ద్రబాబునాయుడు ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని అద్వితీయంగా అభివృద్ది చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేర రాజకీయాలు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ ఎంతో మంది ఆత్మహత్యలకు కారణం అవుతున్నదని పేర్కొన్నారు. చారకొండ, ఉప్పునుంతల టీడీపీ మండలాల అధ్యక్షులు సండూరి శ్రీనివాసులుగౌడ్, కాశన్న, నాయకులు శ్రీనివాసులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.