వైసీపీ అరాచకాలను ఎండగడదాం

ABN , First Publish Date - 2021-11-21T04:11:05+05:30 IST

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నాయకుల అరాచకాలను ఎండగట్టాలని టీడీపీ కార్పొరేటర్లు తీర్మానించారు.

వైసీపీ అరాచకాలను ఎండగడదాం
నినాదాలు చేస్తున్న టీడీపీ కార్పొరేటర్లు

టీడీపీ కార్పొరేటర్ల నిర్ణయం

పెందుర్తి రూరల్‌, నవంబరు 20: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నాయకుల అరాచకాలను ఎండగట్టాలని టీడీపీ కార్పొరేటర్లు తీర్మానించారు. జోన్‌ 8 పరిధిలోని టీడీపీ కార్పొరేటర్లు శనివారం పెందుర్తిలోని ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలు, అరాచ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రజా వ్యతి రేక విధానాలపై ఉద్యమిస్తామని నినాదాలు చేశారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాపర్తి కన్నా, బళ్ల శ్రీనివాసరావు, దాడి రమేశ్‌, బొమ్మిడి రమణ, పీవీ నరసింహం, టీడీపీ సీనియర్‌ నాయకుడు శానాపతి శంకరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-21T04:11:05+05:30 IST