పూలే ఆశయాలను కొనసాగిద్దాం
ABN , First Publish Date - 2021-11-29T04:09:43+05:30 IST
సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావు పూలే ఆశ యాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్, నవంబరు 28 : సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావు పూలే ఆశ యాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మక్త ల్ పట్టణంలో ఆయన స్వగృహంలో పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళిఅర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో బడుగు, బలహీన వర్గాల విద్యకోసం అహర్నిషలు కష్టపడ్డ గొప్ప వ్యక్తి పూలే అని, ఆయన సేవలు మరువలేనివన్నారు. అంతేకాకుండా బీసీ ఐక్య వేదిక, అంబేడ్కర్ సంఘం, బీఎస్పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జుట్ల నర్సిములు, వాకిటి ఆంజనేయులు, అర్జున్రాజ్, లింగన్న, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, రవిశంకర్రెడ్డి, ఎల్లారెడ్డి, ఈశ్వర్యాదవ్, బండారి ఆనంద్ పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్ : జ్యోతిరావు పూలే ఆశయాలను సాదిద్ధామని తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని లోకాయపల్లి లక్ష్మమ్మ దేవాలయ ఆవరణలో తపస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూ లమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సమాజంలో ఉన్నటువంటి అంతరాలను పూడ్చటానికి పూలే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆనాటి సమాజానికి ఎదురొడ్డిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తపస్ బాధ్యులు సీతారాములు, ప్రభాకర్, స్వప్న రాణి, అనిత, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాగనూరు : మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ యువజన సంఘం, బీఎస్పీ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేశంలోనే మొట్టమొదటగా పాఠశాలలు ప్రారంభించి బలహీన వర్గాల వారికి విద్యను అందించిన మహను భావుడని కొనియాడారు. కార్యక్రమంలో అంబేడ్క ర్ యువజన సంఘం నాయకులు కథలప్ప, రమేష్, శ్రీనివాసులు, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
నర్వ : మండల కేంద్రంలోని బీసీ క మ్యూనిటీ భవనం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు, అనంతరం ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బంగ్ల లక్ష్మికాంతారెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుడిసె వెంకటయ్య, దండు అయ్యప్ప, సుదీర్, వెంకటేశ్వర్రావు, కుర్మారెడ్డి పాల్గొన్నారు.