దళిత గిరిజన దండోరాను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-08-03T05:01:19+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉట్నూర్‌ మండల ఆదివాసీ సర్పంచ్‌ల సంఘం ప్రకటించింది.

దళిత గిరిజన దండోరాను అడ్డుకుంటాం
ఉట్నూర్‌లో మాట్లాడుతున్న ఆదివాసీ సర్పంచ్‌లు

ఉట్నూర్‌, ఆగస్టు 2 : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉట్నూర్‌ మండల ఆదివాసీ సర్పంచ్‌ల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉట్నూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షురాలు పెందూర్‌ కళావతి బండు, ప్రధాన కార్యదర్శి జుగదిరావులు మాట్లాడారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దళిత గిరిజన దండోరాను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ఆదివాసీ దినోత్సవం రోజున ఇంద్రవెల్లి స్థూపం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి లంబాడాలు ఎలా వస్తారని ప్రశ్నించారు. 9న కాకుండా ఇతర రోజుల్లో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:01:19+05:30 IST