సాగర్‌లో లెఫ్ట్‌ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్‌ లేఖలు

ABN , First Publish Date - 2021-03-28T21:14:13+05:30 IST

వరుస అపజయాలతో నిరాశతో ఉన్న కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.

సాగర్‌లో లెఫ్ట్‌ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్‌ లేఖలు

హైదరాబాద్‌: వరుస అపజయాలతో నిరాశతో ఉన్న కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలిచి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. సాగర్ ఎన్నికలో అభ్యర్థి ఎంపిక మొదలుకొని అన్నింటిలోనూ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందరికంటే అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం హాలియాలో సభ నిర్వహించి తమ సత్తాను కాంగ్రెస్ నేతలు చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే సాగర్‌లో లెఫ్ట్‌ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్‌ లేఖలు రాసింది. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క లేఖలు రాశారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని లెఫ్ట్‌ నేతలను కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లెఫ్ట్‌ నేతలు చెప్పారు.

Updated Date - 2021-03-28T21:14:13+05:30 IST