ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకుంటాం: అవంతి శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-05-27T22:09:23+05:30 IST

ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారని, ఏడాదిలోనే 90శాతం హామీలను

ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకుంటాం: అవంతి శ్రీనివాస్‌

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారని, ఏడాదిలోనే 90శాతం హామీలను జగన్‌ అమలు చేశారని తెలిపారు. విద్యకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు గురివింద సామెతలా ఉన్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పోలవరం, పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో మహానాడులో సమీక్ష చేసుకోవాలన్నారు. ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నారనుకుంటున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు మైండ్‌సెట్‌ మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని అవంతి సూచించారు. విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-05-27T22:09:23+05:30 IST