ఎల్జీ నుంచి వచ్చేస్తున్న మరో రెండు ఫోన్లు
ABN , First Publish Date - 2020-12-06T02:46:50+05:30 IST
స్మార్ట్ఫోన్ల మార్కెట్లో కొంత వెనుకబడిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ ఎల్జీ రెండు సరికొత్త ఫోన్లను భారత్లో విడుదల చేసేందుకు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో కొంత వెనుకబడిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ ఎల్జీ రెండు సరికొత్త ఫోన్లను భారత్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎల్జీ కే42, ఎల్జీకే52 పేర్లతో ఇవి వస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్జీ కె42లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, హోల్పంచ్ డిజైన్, మీడియా టెక్ హెలియో పీ22 ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. 13 ఎంపీ ప్రధాన సెన్సార్తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించినట్టు రూమర్ల బట్టి తెలుస్తోంది.
ఎల్జీ కే52 స్పెసిఫికేషన్లు: 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ ఫుల్విజన్ డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6765 హెలియో పి34 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్తో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు 13 ఎంపీ కెమెరా, 64 జీబీ అంతర్గత మెమొరీ, 2టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.