అర్హులైన కల్లుగీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-06-18T04:28:29+05:30 IST
అర్హులైన కల్లుగీత కార్మికులందరికీ లైసెన్సులు మంజూరు చేయాలని కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి బాలచందర్గౌడ్ మంత్రి శ్రీనివా్సగౌడ్ను కోరారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు వినతి
కొండపాక, జూన్ 17: అర్హులైన కల్లుగీత కార్మికులందరికీ లైసెన్సులు మంజూరు చేయాలని కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి బాలచందర్గౌడ్ మంత్రి శ్రీనివా్సగౌడ్ను కోరారు. గురువారం హైదరాబాద్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. లైసెన్స్ లేని కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా పొందలేక పోతున్నారని తెలిపారు. గీత కార్మికులందరికీ లైసెన్సులు మంజూరు చేసి అండగా నిలవాలని కోరారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈత, తాటి మొక్కలను నాటి సంరక్షించాలని మంత్రి చెప్పారని ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తొగుట మండల కల్లు గీత వృత్తి దారుల సంఘం అధ్యక్షుడు కీసరి నరే్షగౌడ్, సాదుపల్లి రవీందర్గౌడ్, సింగారం భరత్, వంశీగౌడ్ తదితరులు ఉన్నారు.