ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-09-08T02:53:43+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండడంతో ధవళేశ్వరం
రాజమండ్రి: తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండడంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా గోదావరి వరద నీరు చేరుతోతంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తారు. 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700 క్యూసెక్కుల సాగు నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.