23 మండలాల్లో తేలికపాటి వర్షం
ABN , First Publish Date - 2021-08-02T05:12:25+05:30 IST
జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 23 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 23 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా పుంగనూరులో 20.2మి.మీ, పలమనేరులో 10.6, ఎస్ఆర్పురంలో 8.2, పెనుమూరులో 8.2, గంగవరంలో 6.8, రామసముద్రలో 5.6, నాగలాపురంలో 5.2, తవణంపల్లెలో 5.2, పెద్దపంజాణిలో 5.2, మొలకలచెరువులో 5, నగరిలో 4.6, విజయపురలో 4.4, వాయల్పాడులో 3.6, బంగారుపాళ్యంలో 3.6, పీటీఎంలో 3.2, యాదమరిలో 3.2, చౌడేపల్లెలో 3, చిత్తూరులో 3, కలకడలో 2.8, మదనపల్లెలో 2.6, జీడీనెల్లూరులో 2.6, పిచ్చాటూరులో 2.4, చిన్నగొట్టిగల్లులో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.