41 మండలాల్లో తేలికపాటి వర్షం
ABN , First Publish Date - 2021-10-17T05:11:10+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 8నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 16: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 8నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రామకుప్పంలో 44.8మి.మీ, అత్యల్పంగా బీఎన్ కండ్రిగలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పలమనేరులో 40.6, చిత్తూరులో 40.4, పాకాలలో 37.4, ఐరాలలో 31, గంగవరంలో 27.4, నాగలాపురంలో 24.6, ములకలచెరువులో 22, నిండ్రలో 21.2, శాంతిపురంలో 20.6, పూతలపట్టులో 18.6, పీటీఎంలో 16, తవణంపల్లెలో 15.4, బి.కొత్తకోటలో 14, పిచ్చాటూరులో 14, వరదయ్యపాళ్యంలో 10.4, మదనపల్లెలో 10.2, గంగాధరనెల్లూరులో 10.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా మిగిలిన 20 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షం కురిసింది.