ఐదుగురు ప్రయాణిస్తున్న కారుపై పిడుగుపాటు

ABN , First Publish Date - 2021-07-03T01:28:33+05:30 IST

ఐదుగురు ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఆ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళి

ఐదుగురు ప్రయాణిస్తున్న కారుపై పిడుగుపాటు

వాషింగ్టన్: ఐదుగురు ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. ఆ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్సాస్ రాష్ట్రంలోని వేవర్లీ సిటీ ప్రాంతంలో జూన్ 5న భారీగా వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఆ దృశ్యాలను ఓ ప్రయాణికుడు తన కెమెరాలో రికార్డు చేశాడు. కారుపై పిడుగు పడిన సమయంలో కారులో మూడేళ్లలోపు వయసుగల 3 చిన్నారులు ఉన్నట్టు సమాచారం. అయితే పిడుగుపాటు కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఊహించని ఘటనపట్ల వారంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


Updated Date - 2021-07-03T01:28:33+05:30 IST