175 లీటర్ల సారా.. 295 మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-05-31T10:52:55+05:30 IST

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 115 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం మండలంలో శనివారం తెల్లవారుజామున నిర్వ హించిన దాడుల్లో

175 లీటర్ల సారా.. 295 మద్యం సీసాలు స్వాధీనం

గోపాలపురం/దేవరపల్లి/కుక్కునూరు, మే 30:  జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 115 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం మండలంలో  శనివారం తెల్లవారుజామున నిర్వ హించిన దాడుల్లో కరగపాడు నుంచి వస్తున్న కారులో అక్ర మంగా 100 లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకున్నారు. కారును సీజ్‌ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ శాఖ పోలవరం సీఐ కే.సత్యనారాయణ తెలిపారు. దేవరపల్లి మండలం లక్ష్మీపురం నుంచి 15 లీటర్లు సారాను తాడేపల్లి దేవనంద్‌, కాకి శ్రీను, మోటార్‌ సైకిల్‌పై తరలిస్తుండగా దేవరపల్లి, పల్లంట్ల మధ్య వీరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ  కె.స్వామి తెలిపారు.  కుక్కునూరు సీఐ బాలసురేశ్‌ బాబు, ఎస్‌ఐ పైడిబాబు ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.43 వేలు విలువ చేసే 295 మద్యం సీసాలు పట్టుకున్నారు. 60 లీటర్ల సారా, 1000 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.  బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 

Updated Date - 2020-05-31T10:52:55+05:30 IST