మద్యం విక్రయాలు నిలిపివేయాలి : టీడీపీ

ABN , First Publish Date - 2021-05-18T05:27:12+05:30 IST

లేపాక్షి పోలీ్‌సస్టేషన వెనుక ఉన్న టూరిజం గెస్ట్‌ హౌస్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తిపలకాలని టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప అన్నారు.

మద్యం విక్రయాలు నిలిపివేయాలి : టీడీపీ
వినతిపత్రం అందిస్తున్న కన్వీనర్‌ జయప్ప, నాయకులు

లేపాక్షి, మే 17: లేపాక్షి పోలీ్‌సస్టేషన వెనుక ఉన్న టూరిజం గెస్ట్‌ హౌస్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తిపలకాలని టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునేదిపోయి ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. వెంటనే మద్యం విక్రయాలను అరికట్టాలని తహసీల్దార్‌ బలరాంకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయనపల్లి సదాశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:27:12+05:30 IST