చెబుతున్నా వినరే!
ABN , First Publish Date - 2020-08-12T09:28:54+05:30 IST
కరోనాకు అడ్డుకట్ట వేద్దామంటూ అధికారుల ప్రతిజ్ఞలు. కొవిడ్ నియంత్రణకు సహకరించాలంటూ నిత్యం ప్రచారం. అయితే ప్రజలకు మార్గదర్శ
కరోనాకు అడ్డుకట్ట వేద్దామంటూ అధికారుల ప్రతిజ్ఞలు. కొవిడ్ నియంత్రణకు సహకరించాలంటూ నిత్యం ప్రచారం. అయితే ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రెవెన్యూ సిబ్బంది తీరు మారడం లేదు. ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఆ మేరకు మంగళవారం మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వోలు, వీఆర్ఏలు, వార్డు వలంటీర్లు ఇలా గుంపులుగా చేరారు. ఏ ఒక్కరూ భౌతికదూరం పాటించకుండా ధ్రువపత్రాల పరిశీలనలో మునిగారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కొందరు మాస్కులు కూడా ధరించక పోవడం విమర్శలకు దారితీస్తోంది.
- మదనపల్లె అర్బన్