వృద్ధుల్లో పెరుగుతున్న కాలేయ కేన్సర్‌ ముప్పు

ABN , First Publish Date - 2020-03-24T09:47:12+05:30 IST

వృద్ధులకు కాలేయ కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో...

వృద్ధుల్లో పెరుగుతున్న కాలేయ కేన్సర్‌ ముప్పు

బీజింగ్‌, మార్చి 23 : వృద్ధులకు కాలేయ కేన్సర్‌ ముప్పు పెరుగుతోందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. 1990-2017 మధ్యకాలంలో 195 దేశాల్లో కాలేయ కేన్సర్‌ బారినపడిన స్త్రీ, పురుషుల గణాంకాలను వయసులవారీగా విభజించి విశ్లేషించగా ఈవిషయం తెలిసింది. 1990 సంవత్సరంలో ఆ వ్యాధి పంజాకు చిక్కిన వృద్ధుల సంఖ్య 2,16,561 కాగా.. 2017లో అది పెరిగి 2,41,189కి చేరిందని గుర్తించారు. ఇదేకాలానికి కాలేయ కేన్సర్‌ నిర్ధారణ అయిన 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గి 17,381 నుంచి 14,661కి చేరింది. హెపటైటి్‌స-బి వైరస్‌ కారణంగానూ ఈ వ్యాధి వస్తుంటుంది. యువతలో చాలామందికి బాల్యంలో చేయించిన హెపటైటి్‌స-బి వ్యాక్సినేషన్‌ రక్షణ కవచంగా పనిచేసి కాలేయ కేన్సర్‌ రాకుండా అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

Updated Date - 2020-03-24T09:47:12+05:30 IST