సెంట్రల్ స్టేషనులో రూ.20 లక్షల స్వాధీనం
ABN , First Publish Date - 2021-02-27T13:06:03+05:30 IST
స్థానిక సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.20 లక్షలను ఆర్పీఎఫ్ స్వాఽధీనం చేసుకుని, వారిని అరెస్టుచేసింది. గురువారం జరిగిన ఈ వివరాలను ...
చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): స్థానిక సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.20 లక్షలను ఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టుచేసింది. గురువారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నుంచి గురువారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్న పినాకిని ఎక్స్ప్రెస్ లో వచ్చిన ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో రూ.20 లక్షల కరెన్సీ కట్టలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు తిరునెల్వేలి జిల్లా పాలయంక్కోట్టై, మేల్పాళెయంకు చెందిన యూసుఫ్ అలీ (40), అదర్ (55)లుగా గుర్తించారు. వారిని విచారించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.