స్థానిక కిరాణా దుకాణమే మేలు
ABN , First Publish Date - 2020-06-01T06:03:16+05:30 IST
కరోనా దెబ్బతో వినియోగదారుల వైఖరీ మారిపోతోంది. అవసరమైన వినియోగ వస్తువులు, నిత్యావసరాల కోసం మెగా మాల్స్కు బదులు, స్థానిక కిరాణా దుకాణాలే మేలంటున్నారు. డెలాయిట్ ఇండి యా నిర్వహించిన ఒక సర్వేలో...
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో వినియోగదారుల వైఖరీ మారిపోతోంది. అవసరమైన వినియోగ వస్తువులు, నిత్యావసరాల కోసం మెగా మాల్స్కు బదులు, స్థానిక కిరాణా దుకాణాలే మేలంటున్నారు. డెలాయిట్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది. గత ఆరు వారాల నుంచి వినియోగదారుల వైఖరిలో ఈ మార్పు కనిపిస్తోంది. నూటికి 72 మంది స్థానిక వస్తువుల కోసం ఇంటికి దగ్గరలో ఉండే కిరాణా దుకాణాలే మేలని తేల్చారు. మారిన ఆర్థిక పరిస్థితులతో ఇదివరకటిలా ఎడాపెడా ఏది పడితే అది కొనేందుకూ వినియోగదారులు ఇష్టపడడం లేదు. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ఆహార వస్తువుల మీద, 52 శాతం మంది ఇతర నిత్యావసరాల మీద ఆసక్తి చూపారు. మరోవైపు కరోనా దెబ్బతో ఓలా, ఉబర్ వంటి రైడ్ హేలింగ్ సర్వీసులకూ గిరాకీ తగ్గనుంది.