ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు స్థానికుల ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-06-05T09:47:02+05:30 IST

ఏడాది పొడవునా రోడ్డుపై మురుగు పారుతోందని, దుర్వాసనకు ఇళ్లలో ఉండలేకపోతున్నామని

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు స్థానికుల ఫిర్యాదు

బంజారాహిల్స్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఏడాది పొడవునా రోడ్డుపై మురుగు పారుతోందని, దుర్వాసనకు ఇళ్లలో ఉండలేకపోతున్నామని అపార్ట్‌మెంట్‌ వాసులు గురువారం ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట, నాగార్జుననగర్‌ కాలనీ, సోనాలి హెవెన్స్‌, కమ్మసంఘం రోడ్డులో నిత్యం డ్రైనేజీ మురుగు ప్రవహిస్తోందని పేర్కొన్నారు. సోనాలి హెవెన్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే మురళి, కేటీఆర్‌కు మురుగు నీటి వీడియోను కూడా పోస్టు చేశాడు. 

Updated Date - 2020-06-05T09:47:02+05:30 IST