నేటి నుంచి ములుగులో లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-10T05:56:53+05:30 IST
నేటి నుంచి ములుగులో లాక్డౌన్
ములుగుటౌన్, మే 9 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి పాక్షిక లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. ఎస్సై బొంకూరి ఓంకార్ యా దవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈనెల 25 వరకు లాక్డౌన్ పాటిం చాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచనున్నారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు కావడానికి ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.
మల్లంపల్లిలో పకడ్బందీ అమలు
మండలంలోని మల్లంపల్లి గ్రామంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. వ్యాపారులు, ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందని సర్పచ్ చందా కుమారస్వామి తెలిపారు.