ఈ ఎమ్మెల్యేకు లాక్డౌన్ వర్తించదా..!?
ABN , First Publish Date - 2020-03-30T14:50:49+05:30 IST
దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్న తరుణమిది. ఇంటి నుంచి బయటకు రాకూడదని
- విపత్తు వేళ వినోదమా?
- నేషనల్హైవేలో మనవడితో సరదా ఆటలు
- గుబ్బి ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు
బెంగళూరు : దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్న తరుణమిది. ఇంటి నుంచి బయటకు రాకూడదని అంతర్జాతీయ విపత్తు నుంచి కొంతమేరనైనాని యంత్రించేందుకు ఏకైక మార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రజలను చైతన్యం కలిగించేలా సూచించారు. దేశంలోని వందల కోట్లమంది ఇళ్ళకే పరిమితమయ్యారు. సామాన్యుడు రోడ్డుపై కనిపిస్తే పోలీసులు చితకబాదేస్తున్నారు.
ఇదంతా సామాన్యులకే కానీ మాలాంటి ఎమ్మెల్యేలకు కాదనే రీతిలో వ్యవహరించారు తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గ జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్. శనివారం తూమకూరుకు అనుబంధమైన జాతీయ రహదారిపై మనవడితో సరదాగా ఆ టలాడుతూ కనిపించారు. కుమార్తె కొడుకు చిన్నపాటి ఛార్జింగ్ జీపులో ఆటలాడుతుండగా అక్కడే ఎమ్యెల్యే సంతోషంగా గడిపారు. ఇదే మార్గంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది. ఎ మ్మెల్యే శ్రీనివాస్ మనవడితో కలిసి ఆటలాడే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్కాగా పలు నెటిజన్లు తీవ్రంగానే స్పందించి విమర్శలు చేశారు.