శ్రీకాళహస్తిలో రేపటి నుంచి లాక్ డౌన్
ABN , First Publish Date - 2021-04-26T23:53:50+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక
తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో లాక్డౌన్ కాకుండా కొంత సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఇచ్చారు. ఈ తర్వాత లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని శ్రీనివాస్ ప్రకటించారు.
ఇప్పటికే మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు తిరుపతిలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి ప్రకటించారు. తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు.