కొనసాగుతున్న లాక్డౌన్.. తగ్గని రద్దీ
ABN , First Publish Date - 2020-03-26T21:27:01+05:30 IST
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ తీవ్రంగా శ్రమిస్తోంది.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం కేసీఆర్ కఠిన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ చెక్పోస్టుల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. కొన్ని చోట్ల వాహనదారులు పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగుతుండటం గమనార్హం.
లాక్డౌన్ నేపథ్యంలో షాపులు, కూరగాయల మార్కెట్లలో వ్యాపారులు విపరీతంగా ధరలను పెంచేశారు. నిత్యావసరాలైన కూరగాయలు, సరకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించినప్పటికీ వ్యాపారులు ధరలను పెంచడం విశేషం.