31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2021-03-01T12:33:48+05:30 IST

రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా గత ఏడాది మార్చి

31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా గత ఏడాది మార్చి నుంచి లాక్‌డౌన్‌కు అమలుకు వచ్చింది. కొన్ని నెలల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకాగా, కరోనా నియంత్రణలోకి రావడంతో లాక్‌డౌన్‌కు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సడలింపులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, ఆరోగ్య నిపుణులు, కేంద్రప్రభుత్వ సూచన మేరకు ఈనెల 31వ తేదీ వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2021-03-01T12:33:48+05:30 IST