లాక్‌డౌన్‌ అతిథి!

ABN , First Publish Date - 2020-07-28T07:20:45+05:30 IST

ఈమె స్పెయిన్‌కు చెందిన యువతి. పేరు థెరెస్సా. 4 నెలల క్రితం దక్షిణభారతదేశ పర్యటన చేస్తూ కర్ణాటక రాష్ట్రం ఉడుపి వచ్చింది. ఈలోగా లాక్‌డౌన్‌. వెనక్కి వెళ్లే అవకాశం లేదు.

లాక్‌డౌన్‌ అతిథి!

స్పెయిన్‌ నుంచి పర్యటనకు వచ్చి పల్లెకు చిక్కిన థెరెస్సా!!


బెంగళూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఈమె స్పెయిన్‌కు చెందిన యువతి. పేరు థెరెస్సా. 4 నెలల క్రితం దక్షిణభారతదేశ పర్యటన చేస్తూ కర్ణాటక రాష్ట్రం ఉడుపి వచ్చింది. ఈలోగా లాక్‌డౌన్‌. వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో తన సోదరునితో కలిసి ముంబైలో ఉద్యోగం చేస్తున్న కుటుంబ స్నే హితుడు కృష్ణపూజారి స్వగ్రామమైన ఉడుపి జిల్లా బైందూరు సమీపంలోని హేరంజాలి చేరుకుని వారి నివాసంలోనే అప్పటి నుంచి గడుపుతోంది. ఆ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొనడం, పేడ మోయడం, ముగ్గులు వేయడం, పాలు పి తకడం, కొబ్బరిమట్టలతో అల్లికలు చేయడం, గ్రామస్తులతో మాట్లాడడం, కుం దాపుర కన్నడశైలి పదాలు మాట్లాడడం, అక్షరాలు నేర్చుకుంటోంది. ఇక్కడి జనం అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అంటోంది.

Updated Date - 2020-07-28T07:20:45+05:30 IST