లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సాయం.. తాజాగా వృద్ధురాలి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-08-10T01:55:05+05:30 IST

మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త ప్రభాకర్ మానవత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి ఆర్థిక, వస్తు సహాయం చేసిన ఆయన..

లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సాయం.. తాజాగా వృద్ధురాలి అంత్యక్రియలు

కరీంనగర్: మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త ప్రభాకర్ మానవత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి ఆర్థిక, వస్తు సహాయం చేసిన ఆయన తాజాగా ఓ నిరుపేద వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లికి చెందిన దాన ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఎల్లమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కొడుకు దగ్గర డబ్బులు లేవన్న తెలుసుకున్న కొత్త జైపాల్ రెడ్డి నేనున్నానంటూ ముందుకొచ్చారు. ఎల్లమ్మ అంత్యక్రియలు జరిపించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

Updated Date - 2020-08-10T01:55:05+05:30 IST