యూపీ అంతటా ఆదివారం లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-16T18:53:31+05:30 IST
యూపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
లక్నో : యూపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అరికట్టడానికి ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లాక్డౌన్ రాష్ట్రమంతటా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. మిగితా దుకాణాలు, షాపులు, మాల్స్.. ఇలా అన్నీ మూసేయాలని ఆదేశించారు. ప్రజలందరూ విధిగా మాస్క్ విధించాలని, లేదంటే 1000 రూపాయల జరిమానాను విధిస్తామని ప్రకటించారు. రెండోసారీ అలాగే కొనసాగితే పది వేల రూపాయల జరిమానాను విధించనున్నారు. శుక్రవారం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే వారణాసిలో మాత్రం శని, ఆదివారాల్లో లాక్డౌన్ ఉంటుంది. ఈ రెండు రోజులు పూర్తి లాక్డౌన్ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి తెరిచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.